చిదంబరం నివాసానికి చేరుకుంటున్న కాంగ్రెస్ సీనియర్లు.. పోలీసుల సాయం కోరిన సీబీఐ
Recommended Video
ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఎట్టకేలకు ఆజ్ఞాతం వీడి ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు అంశాలు ప్రస్తావించారు. అసలు ఐఎన్ఎక్స్ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆయన కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్నారనే సమాచారం మేరకు సీబీఐ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వారిని లోనికి రానివ్వకపోవడంతో హైడ్రామా నెలకొంది.
అక్కడినుంచి చిదంబరం నేరుగా జోర్ బాగ్లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు. అదే సమయంలో రెండు సీబీఐ బృందాలు ఆయన నివాసానికి చేరుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం కూడా అక్కడకు చేరుకుంది. అయితే సీబీఐ బృందాలు లోనికి రాకుండా చిదంబరం ఇంటి గేట్లు మూసివేశారు. కొద్దిసేపు వేచి చూసిన సీబీఐ అధికారులు చివరకు గేట్లు దూకి లోనికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే చిదంబరంకు మద్దతుగా పెద్దసంఖ్యలో కాంగ్రెస్ సీనియర్లు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. అదలావుంటే సీబీఐ అధికారులు ఢిల్లీ పోలీసుల సాయం కోరారు. మొత్తానికి సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం ఇంటికి చేరుకోవడంతో హైడ్రామా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications