El Nino: రైతన్నలకు అలర్ట్: కేంద్రం తెచ్చిన కొత్త ప్లాన్ ఇదే!

దేశాన్ని పీడించడానికి సిద్ధమైన ఎల్‌ నినో ముప్పు, రుతుపవనాల అనిశ్చితిపై కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అప్రమత్తమైంది. అన్నదాతను ఆదుకునేందుకు, ఖరీఫ్ సాగును కాపాడేందుకు స్పష్టమైన, పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యంత భరోసానిచ్చారు. దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, వర్షపాతాన్ని ప్రభుత్వం నిరంతరం డేగకన్నుతో పర్యవేక్షిస్తోందని, రైతాంగం ఎట్టిపరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని ఆయన స్పష్టం చేశారు.

తగ్గుతున్న వర్షపాత లోటు.. తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక నిఘా!

ప్రకృతి సవాలు విసిరినా.. జూలై మేఘాలు రైతుకు కాస్త ఊరటనిచ్చాయి. జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 33 శాతం వర్షపాత లోటు నమోదు కాగా, జూలైలో కురుస్తున్న విస్తారమైన వర్షాల వల్ల ఆ లోటు కాస్తా 24 శాతానికి తగ్గిందని మంత్రి చౌహాన్ వెల్లడించారు. దీనివల్ల వర్షపాత లోటుతో అల్లాడుతున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి పడిపోవడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోందని వివరించారు.

El Nino Scare Agri Minister Shivraj Singh Chouhan Unveils Mega Contingency Plan To Save Kharif Crops 2026

తగ్గిన సాగు.. 'ప్రత్యామ్నాయం' వైపు రైతన్న అడుగులు

రుతుపవనాల ఆలస్యం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై కొంత ప్రభావం పడింది. ప్రస్తుతం దేశంలో 350.85 లక్షల హెక్టార్లలో మాత్రమే ఖరీఫ్ సాగు పూర్తయింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 91.95 లక్షల హెక్టార్లు తక్కువ. ముఖ్యంగా సోయాబీన్, పత్తి పంటల సాగు వెనుకబడటంతో, కేంద్రం వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళికలను తెరపైకి తెచ్చింది. తక్కువ నీటితో, స్వల్ప వ్యవధిలోనే చేతికొచ్చే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రైతులకు మంత్రి సూచించారు.

రైతులకు షాక్.. . పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు!
రైతులకు షాక్.. . పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు!

క్షేత్రస్థాయిలో 'ఖేత్ బచావో అభియాన్':

ఈ విపత్కర పరిస్థితులను ముందే ఊహించిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ఐసీఏఆర్ (ICAR) భాగస్వామ్యంతో ప్రతి జిల్లాకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి రాష్ట్రాలకు అందించింది. జూన్ నెలలో దేశవ్యాప్తంగా చేపట్టిన 'ఖేత్ బచావో అభియాన్' (పొలాన్ని రక్షించుకుందాం) కార్యక్రమంలో భాగంగా రికార్డు స్థాయిలో 1.24 లక్షల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అవగాహన సదస్సులు నిర్వహించారు. దీనిద్వారా దాదాపు 80 లక్షల మంది రైతులకు నిపుణులతో నేరుగా సలహాలు, సూచనలు అందించడం విశేషం.

విత్తన నిల్వలు రెడీ.. 'బీమా'తో ఆర్థిక రక్షణ!

రైతాంగానికి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా కేంద్రం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందుకోసం 1.75 లక్షల క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వలను (National Seed Reserves) సిద్ధంగా ఉంచింది. ఎక్కడైనా విత్తనాల కొరత తలెత్తితే క్షణాల్లో సరఫరా చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. దీనికితోడు, రైతులకు పెట్టుబడి కష్టాలు రాకుండా కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) దరఖాస్తులను వేగంగా ఆమోదిస్తున్నామని, ఇప్పటివరకు 94 వేలకు పైగా అప్లికేషన్లను క్లియర్ చేశామని మంత్రి తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల పంట నష్టపోతే ఆర్థిక అండగా నిలిచేందుకు 'ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన' (PMFBY) కింద రిజిస్ట్రేషన్లను మరింత వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

El Nino:10 రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్.. రైతులకు బిగ్ అలర్ట్!
El Nino:10 రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్.. రైతులకు బిగ్ అలర్ట్!

'ఎల్‌ నినో మానిటరింగ్ సెల్'తో నిరంతర నిఘా

ఎల్‌ నినో ముప్పును తిప్పికొట్టేందుకు కేంద్రం ప్రత్యేకంగా 'ఎల్‌ నినో మానిటరింగ్ సెల్'ను రంగంలోకి దించింది. పంటల వాతావరణ నిఘా విభాగం, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌లు నిరంతరం 24/7 సమన్వయం చేసుకుంటూ సాగు ప్రగతిని అంచనా వేస్తున్నాయి. "మేం కేవలం నివేదికలను గమనించడం లేదు.. క్షేత్రస్థాయిలో తగిన వనరులతో ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు, రైతన్నను గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాం" అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ దేశ రైతాంగానికి నమ్మకమైన భరోసానిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+