లోకసభ: దీదీ పార్టీ అభ్యర్థిగా సిరివెన్నెల నటి పోటీ
తృణమూల్ అభ్యర్థుల జాబితాలో మాజీ ఫుట్బాల్ ప్లేయర్ భయాచుంగ్ భూటియా కూడా ఉన్నారు. భూటియా డార్జిలింగ్ స్థానం నుంచి పోటీ చేస్తారు. పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలకు తృణమూల్ కాంగ్రెసు పోటీ చేస్తుంది. పశ్చిమ బెంగాల్లోనే కాకుండా గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని దీదీ చెప్పారు.
తృణమూల్ కాంగ్రెసు అభ్యర్థుల జాబితాలో సినీ తారలు మూన్ మూన్ సేన్, సంధ్యా రాయ్, దేవ్ ఎంఎస్ సేన్ ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యుడిగా పనిచేసిన సుగతా బోస్ జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.
సిట్టింగ్ ఎంపీల్లో మెజారిటీ నాయకులకు మమతా బెనర్జీ తిరిగి టికెట్లు ఇచ్చారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నంచి పోటీ చేస్తాడు. అన్నా హజారే సూచన మేరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తానని మమతా బెనర్జీ చెప్పారు.