Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్..! రేపటి నుంచి 12 రాష్ట్రాల్లో-సీఈసీ షెడ్యూల్ ..!

బీహార్ లో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండో దశలో ఇదే ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఈ ప్రక్రియ వివరాలు వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఓటరుగా నమోదు అయ్యేందుకు నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల సవరణ అవసరం ఉందని ఆయన తెలిపారు.

బీహార్ లో ఇప్పటికే ఎస్ఐఆర్ ను విజయవంతంగా పూర్తి చేశామని, ఇప్పుడు అదే తరహాలో 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఎస్ఐఆర్ కు సహకరించిన బీహార్ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఈసీ.. ఇందులో పాల్గొన్న 7.5 కోట్ల మంది ఓటర్లకు నమస్కరించారు. ఎన్నికల కమిషన్ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులను కలుసుకుని ఈ ప్రక్రియ గురించి వివరంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. రేపటి నుంచి ఓటర్ల జాబితాల సవరణ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, చండీఘర్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేస్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి.

election commission announced first phase of SIR in these states-here are full details

ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ జరిగే 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ రాత్రి నుంచే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల్ని నిలిపేస్తున్నట్లు సీఈసీ తెలిపారు.ఈ రాష్ట్రాల్లోని ఓటర్లు తరువాత ధృవీకరణ కోసం అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉన్న ప్రత్యేక గణన ఫారమ్‌లను అందుకుంటారని తెలిపారు. అర్హులైన ప్రతీ ఓటరుకూ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ఎస్ఐఆర్ చేపడుతున్నట్లు జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శిస్తారని తెలిపారు. రేపటి నుంచి కింద బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఓటరు వివరాలను ధృవీకరించడానికి , ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ప్రతి బీఎల్వో ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శిస్తారని వెల్లడించారు.

election commission announced first phase of SIR in these states-here are full details

2003 ఓటరు జాబితాలో నమోదైన వాటితో సరిపోలిన పేర్లు లేదా వారి తల్లిదండ్రుల పేర్లు ఉన్న ఓటర్లు ఈ ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ తర్వాత కొత్త జాబితాలో చేర్చడానికి అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. రెండో దశ ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం ప్రింటింగ్, ట్రైనింగ్ కార్యక్రమాలు రేపటి నుంచి నవంబర్ 3 వరకూ జరుగుతుందన్నారు. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకూ ఇంటింటి సర్వే ఉంటుందన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ డిసెంబర్ 9 న ఉంటుందన్నారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకూ అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకూ ఓటర్లకు నోటీసుల జారీ ఉంటుందని, ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+