527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న పలు ఆహార ఉత్పత్తుల్లో కాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు ఆయా దేశాలు గుర్తిస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ కారకంగా భావిస్తున్న ఎథిలీన్ ఆక్సైడ్ ను మసాలా పౌడర్లలో గుర్తించిన హాంకాంగ్, సింగపూర్ ఇప్పటికే వాటిపై నిషేధం విధించాయి. ఇదే క్రమంలో యూరోపియన్ యూనియన్ కూడా తాజాగా 527 భారతీయ ఆహార ఉత్పత్తుల్లోఈ ఎథిలీన్ ఆక్సైడ్ ను గుర్తించింది. దీనిపై తదుపరి చర్యల కోసం సిద్ధమవుతోంది.
2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ జరిపిన తనిఖీల్లో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఎథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఈయూ ఫుడ్ సేఫ్టీ అథారిటీ గుర్తించింది. ఇందులో ప్రధానంగా గింజలు, నువ్వులు (313), మూలికలు, సుగంధ ద్రవ్యాలు (60), ఆహారపు ఆహారాలు (48), ఇతర ఆహార ఉత్పత్తులు (34) ఉన్నట్లు తేలింది. ఇదే క్రమంలో అధికారులు 87 కన్ సైన్ మెంట్లను సరిహద్దుల నుంచి తిప్పిపంపినట్లు, మిగిలిన వాటిని కూడా మార్కెట్ నుంచి తప్పించినట్లు తెలిపారు.

ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఓ రంగులేని వాయువు. దీన్ని పురుగుమందు, స్టెరిలైజింగ్ ఏజెంట్గా వాడతారు. అయితే ఈ రసాయనం వాస్తవానికి వైద్య పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఉద్దేశించబడింది. ఇథిలీన్ ఆక్సైడ్ ప్రభావంతో క్యాన్సర్లలో లింఫోమా , లుకేమియా వంటివి వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలలో ఆహార భద్రతను గుర్తించే ఆన్లైన్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (RASFF) కోసం రాపిడ్ అలర్ట్ సిస్టమ్ నుండి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 525 ఆహార ఉత్పత్తులు, రెండు ఫీడ్ ఉత్పత్తులలో రసాయనం కనుగొన్నట్లు చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications