Exams: రెండేళ్ల తరువాత నేరుగా 10వ తరగతి పరీక్షలు, హిజాబ్ నాట్ అలౌడ్, మొండికేస్తే అంతే, నో ఎంట్రీ !
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో రెండు సంవత్సరాలు పదోతరగతి పరీక్షలకు విద్యార్థులు నేరుగా హాజరుకాలేదు. రెండు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా యూనీఫామ్ వేసుకుని రావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కలకలం రేపిన హిజాబ్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని, హిజాబ్ లు వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని విద్యాశాఖా అధికారులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి శాంతించడంతో ఈ సంవత్సరం 8. 73 వేల మంది విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రాలకు హాజరై 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యారు, సోమవారం నుంచి ఏప్రిల్11వ తేదీ వరకు కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రెండు సంవత్సరాల తరువాత !
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో రెండు సంవత్సరాలు పదోతరగతి పరీక్షలకు విద్యార్థులు నేరుగా హాజరుకాలేదు. రెండు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కర్ణాటకలో 2021-22 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

యూనీఫామ్ కచ్చితంగా ఉండాలి
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా యూనీఫామ్ వేసుకుని రావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యూనీఫామ్ లు లేకుండా 10వ తరగతి పరీక్షలకు హాజరుకావడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని పలు జిల్లాల్లో తల్లిదండ్రులు చేసిన మనవిని కర్ణాటక విద్యాశాఖ అధికారులు తిరస్కరించారు.

హిజాబ్ నాట్ అలౌడ్
విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కలకలం రేపిన హిజాబ్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని, హిజాబ్ లు వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని విద్యాశాఖా అధికారులు తేల్చి చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ అధికారులు మనవి చేశారు.

8.73 లక్షల మంది విద్యార్థులు
కరోనా వైరస్ మహమ్మారి శాంతించడంతో ఈ సంవత్సరం 8. 73 వేల మంది విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రాలకు హాజరై 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యారు, 4, 52, 732 మంది అబ్బాయిలు, 4, 21, 110 మంది అమ్మాయిలు, 4, 518 మంది తృతీయ లింగ విద్యార్థులు పరీక్షలకు రాయడానికి సిద్దం అయ్యారు. మార్చి 28వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్11వ తేదీ వరకు కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications