కుమారస్వామిలో ఎగ్జిట్ పోల్ వణుకు : యడ్డీ నుంచి ముప్పు ఉంటుందని ఆందోళన
న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంటే ... యూపీఏ కూటమిలో కాస్త నైరాశ్యం నెలకొంది. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ భాగస్వామ్య కూటమిలో అలజడి నెలకొంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా ? అని ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది.
28 సీట్లలో జయకేతనం
ఇక కర్ణాటకలో బీజేపీ 20 నుంచి 28 సీట్లు గెలుస్తుందనే అంచనాలతో కుమారస్వామి సర్కార్ కునుకుతీయని సిచుయేషన్ ఏర్పడింది. దీనికి తగ్గట్టు మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప బీజేపీ 22 సీట్లు గెలుస్తుందని చెప్పడం .. పోల్స్ కూడా సమానస్థాయిలో రావడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ఇబ్బంది పెట్టనుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తామని స్పష్టంచేశారు.

కుమారస్వామిలో వణుకు
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే బీజేపీ 104 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా .. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ స్థానాల్లోబీజేపీ కైవసం చేసుకుంటుందనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. దీనికితోడు తమకు కొందరు కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారనే వార్తలతో ... లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం మరింత బలాన్ని చేకూరుస్తోంది. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే సంకేతాలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ మాత్రం తమ విజయంపై ధీమాతో ఉన్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications