దుమ్ము లేపిన శశికళ వర్గీయులు: మళ్లీ వస్తే మీ అంతుచూస్తాం
చెన్నై: తమిళనాడు రాజకీయాల కారణంగా రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగన్, వారి న్యాయవాది మీద అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చెయ్యడంతో చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ లేకుండా రంగంలోకి దిగిన నెచ్చెలి శశికళకు వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప పోటీ చెయ్యడానికి సిద్దం అయిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే అన్నాడీఎంకేలో రెండు వర్గాలు కుమ్ములాడుకుంటున్న సమయంలో శశికళ పుష్ప మూడో వర్గంగా రంగంలోకి రావడంతో కార్యకర్తలు సహనం కొల్పోయారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నిక ఒక్క రోజులో జరగవలసి ఉండగా ఇప్పుడు రక్తపాతం మొదలైయ్యింది.

ఇప్పటికే నెచ్చెలి శశికళ మీద ఆరోపణలు చేస్తూ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆమె భర్త, న్యాయవాది మీద దాడి జరగడంతో చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంత జరిగినా పోలీసులు మాత్రం అధికార పార్టీకి సహకరిస్తున్నారని శశికళ పుష్ప వర్గీయులు మండిపడుతున్నారు. ఎది ఏమైనా సరే నెచ్చెలి శశికళ నటరాజన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టకుండా అడ్డుకుంటామని శశికళ పుష్ప వర్గీయులు హెచ్చరించారు.
మరో వైపు రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలు గుంపుగా వచ్చి దాడి చెయ్యడంతో గందరగోళం నెలకొంది. నెచ్చెలి శశికళ నటరాజన్ కావాలనే తన వర్గీయులను రెచ్చగొట్టి దాడి చేయించారని శశికళ పుష్ప వర్గీయులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications