Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TAPS: తమిళనాడులో కొత్త పెన్షన్ విధానం..! ఓపీఎస్, సీపీఎస్ కంటే ఎలా బెటర్ ?

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థ రెండు దశాబ్దాలుగా తీవ్ర రాజకీయ, ఆర్థిక వాదనలకు కేంద్రబిందువుగా మారింది. ఒకవైపు ఉద్యోగులు పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరణను డిమాండ్ చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వాలు దాని వల్ల ఏర్పడే దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని భరించలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎం.కే.స్టాలిన్ ఇవాళ మరో కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో ఉన్న మెరుగైన అంశాల కారణంగా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది.

తమిళనాడులో గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్ సింగ్ బేడి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల పెన్షన్ కమిటీ తాజాగా చేసిన సిఫార్సుల ఆధారంగా తమిళనాడు అస్యూర్డ్ పెన్షన్ స్కీం (TAPS)ను ప్రభుత్వ అమల్లోకి తెచ్చింది. TAPS కింద, ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 10% పెన్షన్ నిధికి జమ చేయాలి, అయితే హామీ ఇవ్వబడిన పెన్షన్‌ను అందించడానికి అవసరమైన అదనపు నిధుల అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

Explained Why Tamil Nadu s Assured Pension Scheme is Better Than CPS and OPS

పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సంవత్సరానికి రెండుసార్లు డీఏ పెంచుతారు. పెన్షనర్ మరణిస్తే, పెన్షనర్ పొందుతున్న పెన్షన్‌లో 60 శాతం నామినేట్ చేయబడిన లబ్ధిదారునికి కుటుంబ పెన్షన్‌గా చెల్లిస్తారు. పదవీ విరమణ సమయంలో లేదా సర్వీసులో ఉన్నప్పుడు మరణించిన సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు కాల వ్యవధి ఆధారంగా ₹25 లక్షలకు మించకుండా గ్రాట్యుటీ అందిస్తారు. పెన్షన్ అర్హత పొందకముందే రిటైర్మెంట్ తీసుకున్నా కనీస పెన్షన్ చెల్లిస్తారు. అలాగే సీపీఎస్ కింద సర్వీస్ లో చేరి కొత్త పథకం అమలుకు ముందు రిటైర్ అయినా ప్రత్యేక పెన్షన్ చెల్లిస్తారు.

Explained Why Tamil Nadu s Assured Pension Scheme is Better Than CPS and OPS

మార్కెట్ రాబడులతో సంబంధం లేకుండా, ఉద్యోగికి "హామీతో కూడిన పెన్షన్" అందిస్తామని ప్రకటించడం ఈ కొత్త పెన్షన్ విధానంలో కీలకమైన అంశం. ఈ కొత్త పథకంలో ఉద్యోగి 10 శాతం వాటా చెల్లిస్తే 50 శాతం పెన్షన్ హామీ లభిస్తుంది. మార్కెట్ రాబడుల ద్వారా ఏర్పడే పెన్షన్ మొత్తం, ఉద్యోగికి రావాల్సిన చివరి జీతంలో 50% కంటే తక్కువైతే, ఆ లోటును ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే భర్తీ చేస్తుంది. ఈ పథకాన్ని కేవలం ఆర్థిక సంస్కరణగా కాకుండా, సామాజిక భద్రతా పథకంగా రూపకల్పన చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి కొన్ని రాష్ట్రాలు నేరుగా ఓపీఎస్ కు వెళ్లినా తమిళనాడు ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన యూపీఎఫ్ పథకం ఆత్మను తీసుకుని ఈ కొత్త పథకాన్ని రూపొందించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+