Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. ఈ భారీ పేలుడు దాటికి భవనం పైకప్పు కులిపోయింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడ్డాయి.పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్2లో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘనటపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాణసంచా ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న ఇళ్లలో నివసిస్తున్నవారిని అప్రమత్తం చేసిన అధికారులు అక్కడ నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Explosion in fireworks factory Seven people died in duttapukur west bengal

అయితే ఈ ఫ్యాక్టరీకి ఎలాంటి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్యలో నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసుల అందదండలతోనే ఈ బాణసంచా తయారు కేంద్రాన్ని నడుపుతున్నట్లు ఆరోపించారు.గోదాంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పదేపదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.

ఈ ఏడాది మే 16న తూర్పు మిడ్నాపూరం్ జిల్లా ఎగ్రాలోని అక్రమ బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఆ ఘటనను మరకముందే మరో పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+