మోడీ ర్యాలీకి కొద్దిముందు పాట్నాలో బ్లాస్ట్, ఒకరి మృతి

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు పేలకుండా ఉన్న మరో రెండు బాంబాలును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ ఘటనా స్థలికి చేరుకొని తనిఖీలు చేపట్టారు.
కాగా, పాట్నాలో ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హూంకార్ ర్యాలీ ఉంది. ఈ ర్యాలీలో మోడీ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో నాటు బాంబు పేలుడు ఘటన కలకలం సృష్టించింది. మోడీ సభకు కొద్ది గంటల ముందే ఈ పేలుడు సంభవించింది.
ఈ ఘటనతో పాట్నాతో పాటు రాష్ట్రంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మోడీ హూంకార్ ర్యాలీకి కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications