మరిదితో అక్రమ సంబంధం.. మధ్యలో ఆపాడని చంపేసింది.. పోలీసుల అదుపులో కామపిశాచి
భర్త పట్ల అయిష్టం పెంచుకున్న ఆ మహిళ తన చేతులతోనే సంసారాన్ని నాశనం చేసుకుంది. తల్లితర్వాతి స్థానంలో ఉండాల్సిన ఆమె.. వావివరుసలు మర్చిపోయి కొడుకులాంటి మరిదిగి వలవేసింది. ప్రతిరోజూ మరిది ద్వారా కామదాహాన్ని తీర్చేకునే ఆమె.. ఆ ఒక్కరోజు వదిలెయ్యమన్నందుకే అతణ్ని పొడిచి చంపేసింది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివి..
మరిదికి వల..
రాయ్ బరేలీ శివారులోని బస్తీలో నివసిస్తూ కూలీ పనులు చేసుకునే ఓ కుటుంబంలో భార్యభర్తలతోపాటు భర్త తమ్ముడు కూడా కలిసుండేవారు. పొద్దంతా పనులు చేసే భర్త అససటతో నిద్రపోతుండటంతో అసంతృప్తికి లోనైన భార్య.. క్రమంగా మరిదికి దగ్గరయ్యేప్రయత్నం చేసింది. కొన్నాళ్లకు వాళ్లిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇంట్లో భర్తలేని సమయంలో గుట్టుగా వ్యవహారం సాగించేవాళ్లు.
ఆ పని మధ్యలో ఆపడంతో..
కొన్నాళ్లుగా మహిళ ప్రవర్తనలో విపరీత మార్పులొచ్చాయని, ఎప్పుడుపడితే అప్పుడు తనతో గడపాలని మరిదిపై ఒత్తిడి పెంచేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం రాత్రి కూడా భర్త నిద్రపోయిన తర్వాత మరిది దగ్గరికెళ్లిన ఆమె.. మరిదిని బలవంతపెట్టింది. అలసటగా ఉంది, వదిలెయ్యమని మరిది వేడుకున్నా ఆమె వదల్లేదు. బలవంతపు కలయికలో అతను మధ్యలో ఆగిపోవడంతో ఆమెకు కోపం నషాళానికెక్కింది. పక్కనే ఉన్న కత్తితో మరిదిపై విచక్షణారహితంగా దాడి చేసింది.
పోలీసుల అదుపులో..
పొద్దున లేచేవరకు రక్తపుమడుగులో పడిపోయిన తమ్ముణ్ని చూసి ఇంటి యజమాని హతాశుడైపోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాధమిక విచారణ తర్వాత మహిళలను అదుపులోకి తీసుకున్నామని, భర్త, స్థానికుల వాగ్మూలాన్ని కూడా నమోదు చేశామని పోలీసులు చెప్పారు.