ఇక విమానాల్లో మాస్క్ మ్యాండెటరీ.. డీజీసీఏ ఆదేశాలు, రీజన్ ఇదే
కరోనా కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా బూస్టర్ డోసు వేసుకొనివారిపై ప్రభావం చూపుతుంది. అయితే ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ.. డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విమానాల్లో మాస్క్ మ్యాండెటరి చేసింది. విమానయాన సంస్థలు ప్రయాణికులు.. కరోనా నిబంధనలను పాటించాలని సూచించింది.
ప్రయాణికులు విధిగా మాస్క్ ధరించాలని స్పస్టంచేసింది. ఎయిర్ పోర్టు వచ్చినప్పటి నుంచి నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ప్లాట్ ఫామ్ మీద కూడా అలానే రూల్స్ వర్తిస్తాయని స్పష్టంచేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరికలు జారీచేసింది.

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కరోనా కేసులు వంద శాతం పెరిగాయి. శనివారం నుంచి రోజుకు ఐదుగురు.. కరోనా బారినపడి సమస్యలతో చనిపోతున్నారు. ఢిల్లీలో గత 15 రోజుల్లో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య రెండు రెట్లు పెరిగింది.
1వ తేదీ నుంచి ఆస్పత్రిలో చేరిన వారి వివరాలను పరిశీలిస్తే.. 307 నుంచి 588కి పెరిగాయి. 205 మంది ఆక్సిజన్ సపోర్ట్ తీసుకున్నారు. 22 మంది వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్నారు. ఐసీయూలో చేరిన వారి సంఖ్య 98 నుంచి 16వ తేదీ వరకు 202కి చేరింది. ఇటు ముంబైలో కూడా క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. 14వ తేదీ వరకు 882 కేసులు చేరుకున్నాయి.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications