25 డెడ్లైన్.. ఒక్క ట్వీట్టర్ కూ మాత్రమే.. ట్విట్టర్, ఎఫ్బీ, వాట్సాప్ బ్యానేనా..?
సోషల్ మీడియాలో విచ్చలవిడితనం.. ఫోటోలు షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఈ ఫిబ్రవరిలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఆ నియమ నిబంధనలను సోషల్ మీడియా యాప్స్ కట్టుబడి ఉండాలి. తమకు సమయం కావాలని కోరడంతో మే 25వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. కొత్త గైడ్ లైన్స్కు మాత్రం అవీ అంగీకరించలేదు. దీంతో రేపటినుంచి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ పనిచేస్తోందా లేదా అనే సందేహాం నెలకొంది.
కొత్త మార్గదర్శకాలు
కొత్త రూల్స్కు ఒక ట్విట్టర్ కూ మాత్రమే అంగీకారం తెలిపింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇంకా తమ సమ్మతిని తెలియజేయలేదు. అలా స్పష్టత ఇవ్వకపోవడంతో అవీ హోదా కోల్పోతాయి. ఇక్కడి చట్టాలకు అనుగుణంగా ఆయా సంస్థలపై ఐటీ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే తమ ప్రధాన కార్యాలయాలు అమెరికాలో ఉండటం వల్లే సమస్య అని.. తమకు మూడు నెలల సమయం సరిపోదని అవి అంటున్నాయి. కనీసం 6 నెలలు కావాలని కోరుతున్నాయి.
రూల్స్ గౌరవిస్తాం..
ఐటీ రూల్స్ను గౌరవిస్తామని ఫేస్బుక్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కొన్ని అంశాలను ప్రభుత్వంతో చర్చిస్తామని వివరించారు. తమ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటామని చెబుతున్నారు. ప్రజలు తమ భావాలను స్వేచ్చగా తెలియజేయడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.
15 రోజుల్లోగా పరిష్కరించాలి..
కొత్త ఐటీ రూల్స్ ప్రకారం కఠినంగా ముందుకెళతారు. అభ్యంతరంగా ఉంటే వెంటనే తొలగిస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కాక.. ఓటీటీలకు కూడా ఇలాంటి నియమ నిబంధనలు వర్తిస్తాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ప్లెక్స్.. ఇతర ఓటీటీలు గ్రీవెన్స్ రెడ్రెసల్ ఆఫీసర్ను నియమించుకోవాల్సి ఉంటుంది. వారి దృష్టికి వచ్చిన సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే వారికి కూడా నిషేధం తప్పదు. సో కొత్త ఐటీ మార్గదర్శకాల ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్ పామ్, ఓటీటీ నడుచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే బ్యాన్ అనే కత్తి వేలాడుతోంది.