ఎస్బీఐ ఏటీఎం షాక్: డ్రా చేస్తే పిల్లలు ఆడుకునే రూ. 2000నోట్లు వచ్చాయ్!
దేశ రాజధానిలోని ఓ ఏటీఎం నుంచి వచ్చిన నోట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సదరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో పిల్లలు ఆడుకొనే నకిలీ 2000 నోట్లు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఓ ఏటీఎం నుంచి వచ్చిన నోట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సదరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో పిల్లలు ఆడుకొనే నకిలీ 2000 నోట్లు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్లో ఉన్న ఓ ఎస్బీఐ ఏటీఎం నుంచి ఈ నోట్లు వచ్చాయి.
మొదట చూడగానే ఇవి అసలు నోట్లుగానే కనిపించినా.. ఈ నోటుపై ఆర్బీఐకి బదులుగా చిల్డ్రెన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, గ్యారెంటీడ్ బై చిల్డ్రన్స్ గవర్న్మెంట్ అని ఉండటం గమనార్హం. చూరన్ లేబుల్ అని ఓ పక్క రాసి ఉంది. బ్యాంకు సీల్కు బదులుగా పీకే లోగో ఉంది.

మొదట ఓ కస్టమర్కు ఇలాంటి నాలుగు నోట్లు వచ్చాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. దీనిపై విచారణ జరపడానికి ఓ ఎస్ఐని పంపించామని, అతను కూడా విత్డ్రా చేయగా.. అలాంటిదే మరో నోటు వచ్చిందని ఆ అధికారి తెలిపారు. ఏటీఎంలో ఉన్న మిగతా నోట్లను పరిశీలించగా.. అవన్నీ అసలువే ఉన్నాయని చెప్పారు.
దక్షిణ ఢిల్లీలోని చత్తార్పూర్ కాల్సెంటర్లో పనిచేసే రోహిత్ అనే వ్యక్తికి మొదటగా ఈ నకిలీ నోట్లు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఈ నకిలీ నోట్లు ఎవరు ఉంచారన్నదానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. అటు ఎస్బీఐ బృందం కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టింది. నోట్లు ఏటీఎంలో పెట్టే సమయంలోనే ఈ నోట్లను కూడా అసలు నోట్లతో కలిపి పెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications