Family: ఓ కూతురు టెక్కీ, మరో కూతురు అకౌంటెంట్, ఇంట్లో తల్లీ, కూతుర్లు సజీవదహనం, రూ, కోట్ల ఆస్తి !
చెన్నై/కోయంబత్తూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసి ఇద్దరు కుమార్తెలకు తల్లి అయ్యింది. దంపతులు వారి ఇద్దరు కూతుర్లను బాగా చదివించారు. ఓ కూతురు సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నది. మరో కూతురు అకౌంటెంట్ గా పని చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నది. ఇద్దరు కూతుర్లు లైఫ్ లో సెటిల్ అవుతున్నారని, మంచి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు అనుకున్నారు. ఇదే సమయంలో యువతుల తండ్రి చనిపోయాడు. భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుర్లను కంటికి రెప్పాలా కాపాడుకుంటున్న తల్లి వారికి పెళ్లి సంబంధాలు చూస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజీరుగా ఉద్యోగం చేసుకున్న యువతి, అకౌంటెంట్ గా పని చేస్తున్న ఆమె సోదరికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న తల్లి, ఆమె ఇద్దరు కూతుర్లు సజీవదహనం కావడం కలకలం రేపింది. తల్లీ కూతర్లతో పాటు వాళ్ల ఇంటిలో ఉన్న పెంపుడు కుక్కలు కూడా సజీవదహనం కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. రెండు సంవత్సరాల క్రితం భర్త, ఇటీవల తల్లి, ఆమె ఇద్దరు కూతుర్లు సజీవదహనం కావడంతో వాళ్ల బంధువులు హడలిపోయారు. రెండు సంవత్సరాల్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఒకే ఇంట్లోని నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో స్థానికులు హడలిపోయారు. ఇంట్లో ఉన్న యూపీఎస్ పేలిపోయి మంటలు వ్యాపించి తల్లీ కూతుర్లు సజీవదహనం అయ్యారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
Wife: నా భార్యను రేప్ చేసి చంపేశారని కేసు పెట్టిన భర్త, షాకింగ్ మ్యాటర్ లీక్, బ్యాంకు అకౌంట్ లో !
ఇద్దరు కూతుర్లతో హ్యాపీలైఫ్
తమిళనాడులోని కోయంబత్తూరులోని ఉరుమందపాళ్యంలోని జోస్ గార్గెన్ ఏరియాలో జ్యోతిలంగం, విజయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. జ్యోతిలింగంను వివాహం చేసుకున్న విజయలక్ష్మి ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసి ఇద్దరు కుమార్తెలకు తల్లి అయ్యింది. జ్యోతిలింగం, విజయలక్ష్మి దంపతులు వారి ఇద్దరు కూతుర్లు అర్చన, అంజలిని బాగా చదివించారు.
2. అందుకేనా
ఒక కూతురు టెక్కీ.... ఇంకో కూతురు అకౌంటెంట్
జ్యోతిలింగం, విజయలక్ష్మిల కూతురు అంజలి సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నది. మరో కూతురు అర్చన అకౌంటెంట్ గా పని చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నది. ఇద్దరు కూతుర్లు అంజలి, అరచ్చన లైఫ్ లో సెటిల్ అవుతున్నారని, మంచి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు అనుకున్నారు.
రెండేళ్ల క్రితం జ్యోతిలింగం చనిపోయాడు
రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో జ్యోతిలింగం చనిపోయాడు. భర్త జ్యోతిలింగం చనిపోయిన తరువాత ఆయన భార్య విజయలక్ష్మి ఆమె ఇద్దరు కూతుర్లు అంజలి, అర్చనను కంటికి రెప్పాలా కాపాడుకుంటున్నది. ఇద్దరు కూతుర్లకు ఆమె తల్లి విజయలక్ష్మి వారి బంధువుల సహాయంతో పెళ్లి సంబంధాలు చూస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజీరుగా ఉద్యోగం చేసుకున్న యువతి, అకౌంటెంట్ గా పని చేస్తున్న ఆమె సోదరికి ఇప్పటికే చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయి.
ఇంట్లో మంటలు వ్యాపించి ?
విజయలక్ష్మి, ఆమె కూతుర్లు అంజలి, అర్చన ఇంట్లో ఉన్న సమయంలో మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విజయలక్ష్మి ఇంటికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంట్లోని వంట గదిలొ ఓ కూతురు, బెడ్ రూమ్ లో ఉన్న తల్లి విజయలక్ష్మి, ఆమె మరో కూతురు శవమై కనిపించారు. తల్లీ విజయలక్ష్మితో పాటు ఆమె ఇద్దరు కూతుర్లు అంజలి, అర్చన సజీవదహనం కావడం కలకలం రేపింది.
Recommended Video
తల్లీకూతుర్లతో పాటు కుక్కలు సజీవదహనం
రెండు సంవత్సరాల క్రితం జ్యోతిలింగం భర్త, ఇప్పుడు తల్లి విజయలక్ష్మి, ఆమె ఇద్దరు కూతుర్లు అంజలి, అర్చన సజీవదహనం కావడంతో వాళ్ల బంధువులు హడలిపోయారు. రెండు సంవత్సరాల్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఒకే ఇంట్లోని నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో స్థానికులు హడలిపోయారు. ఇంట్లో ఉన్న యూపీఎస్ పేలిపోయి మంటలు వ్యాపించి తల్లీ విజయలక్ష్మి, ఆమె ఇద్దరు కూతుర్లు అంజలి, అర్చన సజీవదహనం అయ్యారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. తల్లీ కూతుర్లతో పాటు వాళ్ల ఇంటిలో ఉన్న పెంపుడు కుక్కలు కూడా సజీవదహనం కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.