Wife: భర్త చేసిన పనికి భార్య ఏం చేసిందంటే ?, ఇద్దరు కూతుర్లతో ఆంధ్రా నుంచి పక్కరాష్ట్రానికి వెళ్లి ?
కోలారు/చిత్తూరు: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ దంపతులు గొడవపడ్డాడు. ఇద్దరు పిల్లల మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకోవడం కలకలం రేపింది. భర్త అతని భార్యను, కుమార్తెలను గాలికి వదిలేసి వెళ్లిపోవడంతో పక్క రాష్ట్రానికి వెళ్లిన మహిళ ఇద్దరు కుమార్తెను హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
Romance: దుబాయ్ లో మొగుడు, ఖాళీగా ఉన్నానని కుర్రాడితో ఆంటీ ?, క్లైమాక్స్ లో ఎంతపని జరిగింది ?
ఇద్దరు కుమార్తెలు
ఆంధ్రపదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె నియోజక వర్గం పరిధిలోని రామసముద్రంలో జ్యోతి అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం జ్యోతి బాబు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జ్యోతి, బాబు దంపతులకు ఉదయశ్రీ (8), అక్షర (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజీ చేసిన పెద్దలు
వివాహం చేసుకున్న జ్యోతి, బాబు దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. రానురాను జ్యోతి, బాబు దంపతుల మద్య చిన్నిచిన్న గొడవలు మొదలైనాయి. ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని తరువాత జ్యోతి, బాబు దంపతుల మద్య గొడవలు తారాస్థాయికి పెరిగిపోయాయి. పెద్దలు పంచాయితీలు చేసినా జ్యోతి, బాబు దంపతులు మాత్రం రాజీ కాలేకపోయారు.
భార్యను గాలికి వదిలేసి వెళ్లిపోయిన భర్త
గత ఏడాది జ్యోతి, కూతుర్లను వదిలేసిన భర్త పరారైనాడు. భర్త దూరం కావడంతో ఇద్దరు కుమార్తెలను పోషించడం జ్యోతికి చాలా కఫ్టం అయ్యింది. రామసముంద్రం సమీపంలోని కర్ణాటకలోని ముళబాగిలు సమీపంలోని అంజనాధ్రి కొండ మీదకు ఇద్దరు కుమార్తెలను పిలుచుకుని వెళ్లిన జ్యోతి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది.
పక్క రాష్ట్రంలో ?
ఇద్దరు కుమార్తెలు ఉదయశ్రీ, అక్షర మీద పెట్రోల్ పోసిన జ్యోతి వారికి నిప్పంటించి ఆమె కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలైన ముగ్గురిని ముళబాగిల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అక్షర అనే అమ్మాయి చనిపోయింది, జ్యోతి, ఆమె పెద్ద కుమార్తె ఉదయశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, కేసు విచారణలో ఉందని ముళబాగిల్ పోలీసులు తెలిపారు.