మోదీ పాలనకు 7ఏళ్లు: నేడు బ్లాక్ డే -రైతు ఉద్యమానికి 6నెలల సందర్భంగా దేశమంతటా నల్లజెండాలతో నిరసనలు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మోదీ సర్కారుపై పోరాటంలో కరోనా విలయాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రైతులు కీలక మైలురాయిని చేరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తోన్న నిరసనలు బుధవారం (మే 26) నాటికి ఆరు నెలలు పూర్తయ్యాయి. మరోవైపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 7ఏళ్ల పాలనను పూర్తిచేసుకున్న రోజు కూడా ఇవాళే. ఈ రెండు సందర్భాల నేపథ్యంలో రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్ఛా(ఎస్కేఎం) ఇవాళ బ్లాక్ డేను పాటిస్తున్నది.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్ డే పాటిస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాల్లో రైతులు తమ ఇళ్ల ముందు నల్ల జెండాలు ఎగరేసి నిరసనలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల నల్లజెండాల ఎగురవేత కొనసాగింది.

''బుధవారం బుద్ధ పూర్ణిమ పర్వదినం. సమాజంలో సత్యం, అహింసలు కరవవుతున్నాయి. ఈ ప్రధాన విలువల పునరుద్ధరణ జరిగేలా పండగను జరుపుకోవాలి'' అని సంయుక్త కిసాన్ మోర్ఛా పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు సైతం ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
రైతు ఉద్యమానికి ఆరు నెలలు, మోదీ పాలనకు ఏడేళ్లు సందర్భంగా రైతులు ఇవాళ బ్లాక్ డే జరుపుతుండటంతో కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. నిరసనకారులు లాక్డౌన్ నిబంధనలను పాటించాలని, ఎక్కడా గుంపులుగా చేరకూడదని రైతులకు ఢిల్లీ పోలీసులు సూచించారు. బ్లాక్ డే సందర్భంగా రైతులు కవాతుగా ఢిల్లీకి చేరబోతున్నారనే ప్రచారాన్ని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ తోసిపుచ్చారు. చలో ఢిల్లీ పిలుపు ఇవ్వలేదని, రైతులు ఎక్కడున్నవారు అక్కడే నల్లజెండాలతో నిరసనలు తెలపాలని ఆయన కోరారు. మరోవైపు, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రైతులు సరిహద్దుల్లో ఆందోళన చేస్తుండడంపై దిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపించింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications