రైతు ఆత్మహత్య: 'ఏఏపీ డ్రామా బెడిసి కొట్టింది, ప్రాణం తీసింది!'
న్యూఢిల్లీ: రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) ఆమ్ ఆద్మీ పార్టీ పైన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆత్మహత్య నాటకానికి ఏఏపీ తెర తీయబోయిందని, చివరకు అది విషాదాంతమైందని ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ సంపాదకీయంలో దుయ్యబట్టింది.
ఇకనైనా ఏఏపీ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికింది. కేంద్రం తెస్తున్న భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా జంతర్మంతర్వద్ద ఏఏపీ ర్యాలీలో పాల్గొనే క్రమంలో రాజస్థాన్ రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏఏపీ సభను అత్యంత దిగజారిన రాజకీయ ఎత్తుగడగా ఆర్గనైజర్ అభివర్ణించింది.
ఎప్పటిలాగే ఏఏపీ దేశ రాజకీయాలకు తనదైన విశిష్ట వినోదాన్ని అందించిందని ఎద్దేవా చేశారు. 24గంటల మీడియా కవరేజీతో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అన్ని దారులూ తొక్కుతోందని, నినాదాలు గుప్పించేవారిలోనో, నాయకత్వంలో ఉన్నవారిలోనో భాగంగా గల కొందరు నాటకకర్తలు ఎన్నికల రాజకీయాల్లో గిమ్మిక్కులు చేస్తుంటారని, గరీబీ హఠావో నుంచి అచ్ఛేదిన్ వరకు గల నినాదాలు ఓటర్ల హృదయాలను తాకుతాయన్నారు.

కానీ, రైతు ఆత్మహత్య పేరిట నీచమైన అట్టడుగుస్థాయిని ఏఏపీ తాకిందని దుయ్యబట్టింది. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆత్మహత్యకు రైతు ప్రయత్నిస్తున్నట్టు మీడియా ద్వారా ప్రజలను భ్రమింపజేయాలని ఏఏపీ ప్రయత్నించగా ఆ రైతు నిజంగానే చనిపోవడం నీచ రాజకీయానికి నిదర్శనమని విమర్శించింది.
మరోవైపు, గజేంద్ర సింగ్ ఆత్మహత్యపై సుప్రీం కోర్టులో ప్రజాహి వ్యాజ్యం దాఖలైంది. ఈ ఉదంతంపై దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని జీఎల్ మణి అనే న్యాయవాది కోర్టును కోరారు. అలాగే అకాల వర్షాలతో పంటనష్టం తీవ్రంగా ఉంటున్నదని, విపత్తుల నివారణకు సమగ్ర జాతీయ ప్రణాళికను చేపట్టేలా కేంద్రాని ఆదేశించాలని కోరుతూ మరో పిల్ దాఖలైంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications