ఫరూక్ అబ్దులాకు కరోనా పాజిటివ్: త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోడీ ట్వీట్
శ్రీనగర్: నేసనల్ కాన్ఫెర్స్ అధ్యక్షుడు, లోక్సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో వెల్లడించారు.
'మా నాన్నకు కరోనా పాజిటివ్గా అయ్యింది. కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. దీంతో నేను, మా కుటుంబసభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. గత కొద్ది రోజులుగా మమ్మల్ని కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా'అని ఒమర్ ట్వీట్ చేశారు.

కాగా, ఫరూక్ అబ్దుల్లా త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అబ్దుల్లా, అతని కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఇక జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా 235 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 30వేలు దాటింది. శ్రీనగర్ జిల్లాలోనే కొత్తగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి.
Praying for the good health and speedy recovery of Dr. Farooq Abdullah Ji.
— Narendra Modi (@narendramodi) March 30, 2021
Also praying for your and the entire family’s good health @OmarAbdullah. https://t.co/a3Qw1axCNH
దేశంలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాల్లో వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలోనే దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగానికిపైగా ఉంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలంతా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications