తండ్రిరూప రాక్షసుడు: పెళ్లాంతో గొడవ, ఇద్దరు కూతుళ్లను మట్టుబెట్టిన నీచుడు
తండ్రి.. పిల్లల బాగోగులు చూసుకోవాలి. మంచి చెడ్డ ఆరాతీయాలి. ఓ సంరక్షకుడిగా ఉండాలి. కానీ అతను పిల్లల పాలిట కాలయుముడిగా మారాడు. తన పిల్లలనే మట్టుబెట్టి నాన్న అనే స్థానానికి అపప్రద తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన కలకలం రేపుతుంది.

పచ్చని కాపురంలో..
యూపీలోని సుర్జాపూర్కి చెందిన హరి సోలంకి అనే జంట ఉంటుంది. వారికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అలానే గురువారం కూడా ఘర్షణ చెలరేగింది. కానీ అది కుటుంబంలో విషాదం నింపింది.

భార్యతో గొడవ..
మద్యం సేవించి వచ్చి, భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. మత్తులో ఉన్న భర్త.. తన ఇద్దరు కూతుళ్లపై తన ప్రతాపాన్ని చూపించాడు. బయటకొచ్చి తన కూతుళ్లపై దాడి చేశాడు. దీంతో చిన్నారులు ఇద్దరూ మృతిచెందారు. ఆరేళ్లు, మూడేళ్లు గల ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. తమ ఇంటి సమీపంలో కూతురు మృతదేహాం లభించింది. మరొ కూతురి డెడ్బాడీ పాడుబడ్డ భవనంలో లభించింది.

హతమార్చి..
చిన్నారులను మట్టుబెట్టి హరి సోలంకి పారిపోయాడు. ఘటన తర్వాత అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. మరునాడు హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద అతనిపై కేసులు నమోదు చేశారు. హరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తలపై గాయాలు
ఇద్దరు చిన్నారుల తలపై గాయాలు గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిని బలంగా కొట్టడంతోనే మృతిచెందారని పేర్కొన్నారు. నిందితుడికి కఠినశిక్ష విధించేలా కోర్టుకు ఆధారాలు సమర్పిస్పామని తెలిపారు. సుర్జాపూర్లో ఇద్దరు చిన్నారుల హత్యతో భీతవాహ వాతావరణం నెలకొంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications