తండ్రిరూప రాక్షసుడు: పెళ్లాంతో గొడవ, ఇద్దరు కూతుళ్లను మట్టుబెట్టిన నీచుడు
తండ్రి.. పిల్లల బాగోగులు చూసుకోవాలి. మంచి చెడ్డ ఆరాతీయాలి. ఓ సంరక్షకుడిగా ఉండాలి. కానీ అతను పిల్లల పాలిట కాలయుముడిగా మారాడు. తన పిల్లలనే మట్టుబెట్టి నాన్న అనే స్థానానికి అపప్రద తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన కలకలం రేపుతుంది.

పచ్చని కాపురంలో..
యూపీలోని సుర్జాపూర్కి చెందిన హరి సోలంకి అనే జంట ఉంటుంది. వారికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అలానే గురువారం కూడా ఘర్షణ చెలరేగింది. కానీ అది కుటుంబంలో విషాదం నింపింది.

భార్యతో గొడవ..
మద్యం సేవించి వచ్చి, భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. మత్తులో ఉన్న భర్త.. తన ఇద్దరు కూతుళ్లపై తన ప్రతాపాన్ని చూపించాడు. బయటకొచ్చి తన కూతుళ్లపై దాడి చేశాడు. దీంతో చిన్నారులు ఇద్దరూ మృతిచెందారు. ఆరేళ్లు, మూడేళ్లు గల ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. తమ ఇంటి సమీపంలో కూతురు మృతదేహాం లభించింది. మరొ కూతురి డెడ్బాడీ పాడుబడ్డ భవనంలో లభించింది.

హతమార్చి..
చిన్నారులను మట్టుబెట్టి హరి సోలంకి పారిపోయాడు. ఘటన తర్వాత అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. మరునాడు హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద అతనిపై కేసులు నమోదు చేశారు. హరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తలపై గాయాలు
ఇద్దరు చిన్నారుల తలపై గాయాలు గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిని బలంగా కొట్టడంతోనే మృతిచెందారని పేర్కొన్నారు. నిందితుడికి కఠినశిక్ష విధించేలా కోర్టుకు ఆధారాలు సమర్పిస్పామని తెలిపారు. సుర్జాపూర్లో ఇద్దరు చిన్నారుల హత్యతో భీతవాహ వాతావరణం నెలకొంది.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications