వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు నో, కరుణ కోసం వెనక్కి: మెరినా బీచ్‌లో అంత్యక్రియలపై ఏం జరిగిందంటే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

జయకు నో, కరుణకు ఏమంటారో!!!

చెన్నై: కరుణానిధి అంత్యక్రియల విషయంలో తమిళనాడు ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, మెరీనా బీచ్ పక్కనే ఆయనకు స్థలం ఇవ్వాలని డీఎంకే ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. కానీ జయలలిత మృతి సమయంలోనే ఈ రాజకీయం చోటు చేసుకుంది. అప్పుడు జయకు వ్యతిరేకింగా వేసిన పిటిషన్‌నే ఇప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.

ముగిసిన కరుణానిధి శకం: మృత్యువుతో పోరాడుతూ కలైంజ్ఞర్ కన్నుమూతముగిసిన కరుణానిధి శకం: మృత్యువుతో పోరాడుతూ కలైంజ్ఞర్ కన్నుమూత

నా పిల్ చూపించి ప్రభుత్వం

నా పిల్ చూపించి ప్రభుత్వం

నాడు, మెరీనా బీచ్‌లో జయలలిత మెమోరియల్‌కు వ్యతిరేకంగా పిల్ వేసిన దురైసామి ఇప్పుడు హఠాత్తుగా కరుణానిధి కోసం ఉపసంహరించుకున్నారు. అదే పిల్‌ను చూపించి ప్రభుత్వం నో చెప్పగా, దురైసామి ఆగమేఘాల మీద జయ మెమోరియల్‌కు వ్యతిరేకంగా వేసిన పిల్‌ను ఇన్నాళ్లకు.. మంగళవారం రాత్రి ఉపసంహరంచుకున్నారు. కరుణకు రూట్ క్లియర్ చేసేందుకు వెనక్కి తగ్గారు.

నిన్న జయకు వద్దని పిటిషన్, నేడు కరుణకు కావాలంటూ ఉపసంహరణ

నిన్న జయకు వద్దని పిటిషన్, నేడు కరుణకు కావాలంటూ ఉపసంహరణ

కరుణానిధికి మెరినా బీచ్‌లో స్థలం కావాలంటూ డీఎంకే వేసిన పిటిషన్‌ను మంగళవారం అర్థరాత్రి దాటాక జస్టిస్‌ రమేశ్‌, జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. మెరీనా బీచ్‌లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు జరపరాదంటూ హైకోర్టులో గతంలో పిటిషన్‌ వేసిన ఎం దురైస్వామి హుటాహుటిన జస్టిస్‌ రమేశ్‌ నివాసానికి చేరుకున్నారు. తన పిటిషన్‌ను ఉపయోగించుకుని తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరై తన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు చెబుతున్నానని, కరుణానిధికి అన్నాదురై సమాధి పక్కనే అంత్యక్రియలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వేసిన పిటిషన్‌నే అన్నాడీఎంకే ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగించుకుంది. నాడు జయలలిత మెమోరియల్ విషయంలోను వారు రాజకీయం చేశారు. ఇప్పుడు అదే పిటిషన్‌ను పళనిస్వామి ప్రభుత్వం ఓ ఆయుధంగా ఉపయోగించుకుంది.

ఆ పిటిషన్ వల్లే సొంతవాడు వేసిన పిటిషన్ వల్లే

ఆ పిటిషన్ వల్లే సొంతవాడు వేసిన పిటిషన్ వల్లే


అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధికి చోటు కల్పించాలని కోరారు. డీఎంకే, విపక్షాలు ప్రతి అంశంలోకి ఆరెస్సెస్, బీజేపీలను లాగుతాయనే విషయం తెలిసిందే. ఇందులోకి కూడా లాగింది. మెరినా బీచ్‌లో ఇవ్వకపోవడం వెనుక ఆరెస్సెస్ ఉన్నట్లుగా కనిపిస్తోందని, బీజేపీ విషయం ఇప్పుడు తేలిపోయిందని డీఎంకే లాయర్ శరవణన్ ట్వీట్ చేశారు. అయితే, జయకు వ్యతిరేకంగా నాడు దురైసామి పిటిషన్ వేసి, ఇప్పుడు కరుణ కోసం తగ్గడంపై డీఎంకే స్పందించడం లేదు.

 అర్ధరాత్రి వాదనలు

అర్ధరాత్రి వాదనలు

కరుణకు మెరీనా బీచ్‌లో అంత్యక్రియల విషయమై మంగళవారం అర్ధరాత్రి వాదనలు సాగాయి. ఆ తర్వాత డిఎంకే పిటిషన్ పైన సిద్ధం కాలేదని, తమకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు లాయర్ అడిగారు. దీంతో న్యాయస్థానం బుధవారం ఉదయం 8 గంటల వరకు సమయం ఇచ్చింది. కరుణకు మెరినా బీచ్‌లో ఎందుకు చోటివ్వకూడదో చెప్పాలని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫు లాయర్లు లీగల్ అంశాలను ప్రస్తావించకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని, మెరీనా బీచ్‌లో కరుణానిధికి ఆరు అడుగుల స్థలం కోసం రాజకీయం చేస్తున్్నారని డీఎంకే లాయర్ శరవణన్ అన్నారు.

English summary
The Tamil Nadu government cannot use my petition to deny a burial ground to Karunanidhi. I am withdrawing my earlier plea against the Jaya memorial. It is wrong for the govt to use my plea to deny burial ground to Karunanidhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X