నిర్భయ దోషులకు చనిపోయే వరకూ ఉరి: శిక్ష ఆలస్యమైందని గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరితీతపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. 'చివరికి.. చనిపోయేవరకూ ఉరితీశారు.. నాకు తెలుసు.. నిర్భయ విషయంలో చాలా ఆలస్యం జరిగింది' అని ట్విట్టర్ వేదికగా గంభీర్ వ్యాఖ్యానించారు.
2012, డిసెంబర్ 16న 23ఏళ్ల నిర్భయ, ఆమె స్నేహితుడు దక్షిణ ఢిల్లీలో ఒక బస్సులో ప్రయాణిస్తుండగా.. ఆరుగురు దుండగులు వీరిపై దాడి చేశారు. అనంతరం నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత నడిరోడ్డుపై పడేసి పరారయ్యారు.

కాగా, తీవ్రగాయాలపాలైన నిర్భయ 15 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది.. డిసెంబర్ 29న సింగపూర్ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది. ఈ కేసులు నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుజామున 5.30గంటలకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.
Hanged till death! Finally! I know we are late Nirbhaya. #NirbhayaJustice
— Gautam Gambhir (@GautamGambhir) March 20, 2020
ఇది ఇలావుండగా, నిర్భయపై దారుణంగా లైంగికదాడి చేసి.. చనిపోయేందుకు కారణమైన దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని నిర్భయ తల్లి ఆశాదేవి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు ఎంత చిత్రవధతో చనిపోయిందో చూశానని.. దోషుల శిక్ష కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. చివరికి ఇవాళ న్యాయం జరిగిందని తెలిపారు. తన కూతురికి జన్మనిచ్చానని.. కానీ కాపాడుకోలేకపోయానని విలపించారు. కానీ తన కూతురు మరణానికి కారణమైన వారికి మాత్రం శిక్ష విధించడంతో న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
Recommended Video
నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష అమలుపై ఆమె తండ్రి బద్రీనాథ్ సింగ్ స్పందించారు. దోషులకు శిక్ష విధించేందుకు చాలా సమయం తీసుకున్నారు... కానీ చివరికి తమకు న్యాయం జరిగిందని తెలిపారు. దోషులకు శిక్ష విధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. నగరాలు, పట్టణాల్లో ఉరిశిక్షను స్వాగతించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications