మాస్క్ ధరించకపోతే.. విమానం మోతే: కళ్లు తిరిగే ఫైన్: మూడింతలు పెంపు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ ఆరంభమైందనే సంకేతాలను పంపిస్తోంది. దసరా, దీపావళి పండగ సీజన్ ముందు నుంచే ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. పండగ సీజన్ ముగిసే నాటికి భారీగా పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలనేవీ ఢిల్లీవాసులు పాటించట్లేదని భావించిన అరవింద్ కేజ్రీవాల ప్రభుత్వం.. కఠిన నిర్ణయాలను తీసుకుంది.
మాస్క్ ధరించకుండా తిరిగే వారిపై జరిమానాల కొరడాను ఝుళిపించింది. ఏకంగా 2,000 రూపాయల జరిమానాను విధించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 500 రూపాయల జరిమానా మొత్తాన్ని 2,000కు పెంచింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలను మరింత అప్రమత్తులను చేయడం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకన్నట్లు వెల్లడించారు. ఛాత్ పూజ వేడుకలను తాము నిషేధించట్లేదని తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న సమయంలో ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అఖిల పక్ష భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు. ప్రజలు ఇళ్లల్లో జరుపుకొనే పండగలను నిషేధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అన్నారు.
అందుకే- పండగలను యధాతథంగా నిర్వహించుకోవచ్చని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో మాత్రం మాస్కులను ధరించాలని సూచించారు. దీనికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశామని, ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాను విధిస్తామని అన్నారు. ఇదివరకు 500 రూపాయల జరిమానాను విధించినప్పటికీ.. ప్రజలెవరూ దాన్ని ఖాతరు చేయలేదని, అందుకే జరిమానా మొత్తాన్ని పెంచామని స్పష్టం చేశారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications