ఆస్పత్రిలో మంటలు.. చిన్నారుల వార్డులో హాహాకారాలు.. కొనసాగుతోన్న సహాయక చర్యలు
మధ్యప్రదేశ్లో గల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. భోపాల్ కమల నెహ్రూ దవాఖానలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ గల చిన్నారుల వార్డులో మంటలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ వార్డులో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు రావడానికి గల కారణం తెలియరాలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Recommended Video
ప్రమాదంలో కొందరు చిన్నారులు గాయపడ్డారని తెలుస్తోంది. మంటలు చెలరేగాక వార్డు నుంచి వచ్చే సమయంలో మెట్ల నుంచి పేరంట్స్ పడిపోతూ కనిపించారు. ఆ విజువల్స్ హృదయ విదారకరంగా ఉన్నాయి. ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ చర్యలు తీసుకుంటామని.. అధికారులు ఎప్పుడూ తనతో టచ్లో ఉంటారని వివరించారు. పిల్లలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని.. వారికి ఏం కాదు అని భరోసా ఇచ్చారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications