ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం: చిన్నారి సహా ఏడుగురు సజీవ దహనం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. డిండిగల్-తిరుచ్చి హైవేలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొందరు పేషెంట్లు, సిబ్బంది మంటల్లో చిక్కకున్నారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైరింజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. పోలీసులు, రెస్క్యూ బలగాలు ఆస్పత్రిలో చిక్కుకున్న రోగులు, సిబ్బందిని బయటికి తీసుకువస్తున్నారు. గాయపడినవారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న 40కి పైగా అంబులెన్స్లు గాయపడినవారిని చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. ఘటన జరిగిన ప్రాంతానికి జిల్లా కలెక్టర్ పూంగోడి, పళని ఎమ్మెల్యే ఐబీ సెంథిల్కుమార్ చేరుకున్నారు.
పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించారు. రిసెప్షన్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధరించారు. ఆ తర్వాత ఇతర అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని కొందరు, భారీగా ఎగిసిన మంటలు, పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
Tamil Nadu | Dindigul District Collector MN Poongodi says, "A fire broke out at a private hospital about two hours ago. The patients here have been rescued and admitted to nearby government and private hospitals. There could be some casualties, but we will confirm the number of… https://t.co/xkXVCS8GyX pic.twitter.com/BDLzZaEmSF
— ANI (@ANI) December 12, 2024
దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ పూంగోడి ఈ ప్రమాద ఘటనపై మాట్లాడుతూ.. రెండు గంటల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఇక్కడి రోగులను రక్షించి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. కొంత మంది ప్రాణనష్టం సంభవించవచ్చు. అయితే మృతుల సంఖ్యను.. వైద్యులు ధృవీకరించిన తర్వాత మాత్రమే నిర్ధరిస్తామని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications