బైకుల్లా జూ: దేశంలో పుట్టిన తొలి పెంగ్విన్ పిల్ల మృతి
ముంబై: దేశంలో తొలిసారిగా జన్మించిన పెంగ్విన్ మృతి చెందింది. పెంగ్విన్ పిల్ల బుధవారం (ఆగస్టు 22న)రాత్రి మృతి చెందినట్లు జీజామాత ఉద్యాన అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆగస్టు 15న రాత్రి ఎనిమిది గంటలకు ముంబైలోని జీజామాతజూలో పెంగ్విన్ జన్మించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పెంగ్విన్ పిల్ల హుషారుగా, ఆరోగ్యంగా ఉందని అధికారులు ప్రకటించారు.

మిస్టర్ మోల్ట్, ప్లిప్పెర్ అనే పెంగ్విన్లకు ఈ బుల్లి పెంగ్విన్ జన్మించింది. దీన్ని కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని చెప్పిన అధికారులు మృతికి గల కారణాలను వెల్లడించలేదు. కాగా, పెంగ్విన్ల సంరక్షణ కోసం రూ.2.5కోట్లు ఖర్చు చేస్తుండటం గమనార్హం. హంబోల్ట్ పెంగ్విన్లను 2016లో ఈ జూకి తీసుకొచ్చారు.













Click it and Unblock the Notifications