వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బైకుల్లా జూ: దేశంలో పుట్టిన తొలి పెంగ్విన్ పిల్ల మృతి
ముంబై: దేశంలో తొలిసారిగా జన్మించిన పెంగ్విన్ మృతి చెందింది. పెంగ్విన్ పిల్ల బుధవారం (ఆగస్టు 22న)రాత్రి మృతి చెందినట్లు జీజామాత ఉద్యాన అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆగస్టు 15న రాత్రి ఎనిమిది గంటలకు ముంబైలోని జీజామాతజూలో పెంగ్విన్ జన్మించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పెంగ్విన్ పిల్ల హుషారుగా, ఆరోగ్యంగా ఉందని అధికారులు ప్రకటించారు.
మిస్టర్ మోల్ట్, ప్లిప్పెర్ అనే పెంగ్విన్లకు ఈ బుల్లి పెంగ్విన్ జన్మించింది. దీన్ని కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని చెప్పిన అధికారులు మృతికి గల కారణాలను వెల్లడించలేదు. కాగా, పెంగ్విన్ల సంరక్షణ కోసం రూ.2.5కోట్లు ఖర్చు చేస్తుండటం గమనార్హం. హంబోల్ట్ పెంగ్విన్లను 2016లో ఈ జూకి తీసుకొచ్చారు.
English summary
The first Humboldt Penguin that was ever born at Mumbai’s Byculla zoo on Independence Day, has died. It was a moment of joy for the zoo authorities on August 15, when the penguin was born. Zoo authorities have said its death was due to anomalies associated with newborn penguins.
Story first published: Saturday, August 25, 2018, 13:27 [IST]