Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్‌సభ సమావేశాలు నేటి నుంచే: ప్రధాని మోడీ సహా ఎంపీల ప్రమాణం

న్యూఢిల్లీ: నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి 18వ లోక్‌సభ తొలి సమావేశాలు. జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. భర్తృహరి మహతాబ్‌ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందే బిజు జనతాదళ్‌ను వీడి బీజేపీలో చేరారు. కటక్‌ నుంచి పోటీచేసి ఏడోసారి ఘన విజయం సాధించారు.

ఇక, సోమవారం ఉదయం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం పార్లమెంట్‌కు చేరుకోనున్న భర్తృహరి 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత తనకు సహయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానల్‌ ఆఫ్‌ ఛైర్‌పర్సన్‌లతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు.

First Session Of 18th Lok Sabha from today

మరోవైపు, కేబినెట్‌ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో మొదలవుతుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్‌సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు. అనంతరం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు.

సాధారణ సభ్యుల్లో అండమాన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు బిష్ణుపద రే తొలుత ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తికానుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్‌తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్టచివరన పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ బీర్‌భూమ్‌ శతాబ్దిరాయ్‌తో ఈ క్రతువు ముగుస్తుంది.

ఇది ఇలావుండగా, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జూన్ 26వ తేదీన జరగనుంది. అనంతరం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేస్తారు. జూన్‌ 27న పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. జులై 2 లేదా 3వ తేదీన ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం జులై 22న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 22న ప్రవేశపెట్టనున్నారు.ఈసారి బడ్జెట్ పై వేతన జీవులు, సామాన్యులు భారీగానే అశలు పెట్టుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+