శివకాశీలో మరో ప్రమాదం.. ఐదుగురి మృతి... పలువురికి గాయాలు
తమిళనాడులో గల శివకాశీ పటాకుల ఫ్యాక్టరీలో మరో ప్రమాదం జరిగింది. కలైయార్కురుచ్చి వద్ద గల ఫ్యాకర్టీలో పేలుడు సంభవించింది. ప్రమాదంతో ఐదుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలతో మరిన్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది నిలువరించారు.
ఘటనా స్థలం నుంచి శిథిలాలను తొలగించారు. గాయపడ్డడ వారిని అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీ రెండు వారాల క్రితం ప్రమాదం జరిగిన సత్తూరుకు దగ్గరలో ఉంది. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో 23 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కెమికల్స్ మిక్స్ చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు.
ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని తెలియజేశారు. ప్రధాని మోడీ పీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చొప్పున అందజేస్తారు.