నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో అయిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలిక నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లిన దుండగులు, ఎవరూ లేని చోటుకు తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను పొలాల్లో వదిలి పెట్టారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటన హపూర్ జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు శనివారం తెలిపారు. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగిందని చెప్పారు.
ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. అర్ధరాత్రి తల్లికి మెలకువ వచ్చి చూసే సరికి బాలిక కనిపించలేదు.
దీంతో బాలిక కోసం గాలించగా స్థానికంగా ఉన్న బావి వద్ద చిన్నారి స్పృహ కోల్పోయి కనిపించింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అత్యాచారానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుల కోసం గాలిస్తున్నారు.