వరదలు: ఈశాన్య రాష్ట్రాల్లో 55మంది మృతి(పిక్చర్స్)
గౌహతి: అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
భారీ వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మేఘాలయాలో 35మంది మృతి చెందగా, వరదల్లో గల్లంతైన 20 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదని మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా తెలిపారు. అస్సాంలో పలుచోట్ల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 20మంది మృతి చెందారు.
రెండు రాష్ట్రాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 17ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు బోట్లు, ఇతర మార్గాల ద్వారా 3,658 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.
నీటమునిగిన గౌహతి
అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి.
వరద బీభత్సం
వరదలు, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
వరద కష్టాలు
భారీ వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మేఘాలయాలో 35మంది మృతి చెందగా, వరదల్లో గల్లంతైన 20 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదని మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా తెలిపారు.
నీటిని తొడిపోస్తూ..
అస్సాంలో పలుచోట్ల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 20మంది మృతి చెందారు. రెండు రాష్ట్రాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వరద నీటిలో..
ఇప్పటి వరకు బోట్లు, ఇతర మార్గాల ద్వారా 3,658 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.