లైవ్ టెలికాస్ట్లో, డివిజన్ పద్ధతిలో బలనిరూపణ: సుప్రీంకోర్టులో అభిషేక్ సింగ్వీ
కాంగ్రెస్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి కూడా మహారాష్ట్రలో 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ధర్మసనాన్ని కోరారు. దీంతోపాటు కర్ణాటక, ఉత్తరాఖండ్ మాదిరిగా లైవ్ టెలికాస్ట్లో బలనిరూపణ చేయాలని ధర్మసనానికి విన్నవించారు. అలాగే డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలన్నారు. మహారాష్ట్రలో సీఎం, డిప్యూటీ సీఎం ఎలా పదవీ చేపట్టారని సింగ్వి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
ఇవాళ ఆదివారం సుప్రీంకోర్టుకు సెలవు. కానీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సీరియస్నెస్ దృష్ట్యా నేపథ్యంలో పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.

సీనియర్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ శివసేన, ఎన్సీపీ తరపున తమ వాదనలను వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ అడ్వకేట్ దేవదత్త్ కామట్ వాదనలు కొనసాగించారు. మహారాష్ట్ర గవర్నర్ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తమ వాదనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి బీజేపీ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తురు.












Click it and Unblock the Notifications