వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో విషాదం: ఆలయంలో ప్రసాదం సేవించి 12 మంది మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka Chamarajanagar Temple Prasad Case: CM Kumaraswamy Meets Hospitalised People

కర్నాటకలో విషాదం చోటుచేసుకుంది. హనూర్‌లోని సుల్వాడీ కిచ్చుగుట్టి మారమ్మ ఆలయంలో ఆహారం తిని 12 మంది మృతి చెందారు ఇందులో 15 ఏళ్ల బాలిక కూడా ఉంది. మరో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది. ఆహారం సేవించిన భక్తులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని మైసూరు, కొల్లెగల్, కమగెరె ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Food poisoning at Hindu temple ceremony in India leaves at least 12 dead

భక్తులకు ఇచ్చిన ప్రసాదంలో విషం కలిసి ఉండొచ్చని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి శాంపిల్స్ తీసుకుని పరీక్షల నిమిత్తమై లాబొరేటరీకి పంపామని అధికారులు వెల్లడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 12 మంది పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స కోసం మైసూరుకు తరలించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే కొత్తగా నిర్మించిన మారమ్మ ఆలయంలో భక్తులు ఎక్కువగా వచ్చారు. వారికి ప్రసాదాలు అందజేశారు ఆలయ నిర్వహకులు. ప్రసాదం తీసుకున్న భక్తులు వెంటనే వాంతులు చేసుకున్నారు. మరికొందరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొందరు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు.

విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం కూడా చేరుకుని వైద్యాధికారులు అస్వస్థతకు గురైన భక్తులకు ప్రాథమిక చికిత్స చేశారు. ఘటనపై షాక్‌కు గురైన ముఖ్యమంత్రి కుమారస్వామి భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు కర్నాటక ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ప్రకటించింది.ఇదిలా ఉంటే చికిత్స పొందుతున్న భక్తులను సీఎం కుమార స్వామి పరామర్శించారు.

English summary
At least 10 people in southern India have died of suspected food poisoning after they ate contaminated food at an opening ceremony at a new Hindu temple.Dozens of people were taken to hospital following the event in the Chamarajnagar district of Karnataka state on Friday, police said.Local media reported anywhere between 10 and 12 people had died, with some reporting a 15-year-old girl was among the victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X