Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

students: నర్సింగ్ కాలేజ్ లో ఏం జరిగింది ?, ఒకేసారి వంద మంది విద్యార్థులు ఆసుపత్రికి !

నగరంలోని సిటీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులకు ఫుడ్ పాయిజనింగ్ జరిగిన ఘటనలో సిటీ ఆస్పత్రి, సిటీ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం బోర్డుపై కేసు నమోదైంది.

బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు నగరంలోని సిటీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులకు ఫుడ్ పాయిజనింగ్ జరిగిన ఘటనలో సిటీ ఆస్పత్రి, సిటీ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం బోర్డుపై కేసు నమోదైంది.

మంగళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో ఆ కాలేజ్ నిర్వాహకుల మీద కాలేజ్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

 Food poisoning in college hostel, 100 students treated in hospital. The police filed the case in Mangaluru.

హాస్టల్‌ విద్యార్థులకు వాంతులు విరేచనాలు అవుతున్నాయని, అయితే కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో శక్తినగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్‌ సుధాంశు హాస్టల్‌ను సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా సంబంధిత హెల్త్‌ ఆఫీసర్‌ పట్టించుకోలేదని ఆరోపించారు.

సిటీ నర్సింగ్ కాలేజీ, సిటీ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బోర్డుపై కేసు నమోదైంది. ఈ ఘటనపై సరైన సమాచారం ఇవ్వకుండా జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. విషపూరితమైన ఆహారం తిని 231 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 116 మంది విద్యార్థులు ప్రస్తుతం మంగళూరు సిటీలోని వివిధ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు, 115 మంది విద్యార్థులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు అంటున్నారు.

అయితే కాలేజ్ లో విద్యార్థులు భోజనం చేసిన తరువాత ఎందుకు ఫుడ్ పాయిజన్ అయ్యింది ? అనే విషయంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఆసుపత్రిని సందర్శించిన అధికారుల బృందం ఇప్పటికే అంబులెన్స్‌తో పాటు ప్రత్యేక వైద్య బృందాన్ని విద్యార్థులు నివసిస్తున్న వసతి గృహానికి పంపించి మిగిలిన విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించారు.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జిల్లా ఇన్స్పెక్టర్, ప్రిన్సిపాల్, జిల్లా శిక్షణా కేంద్రం సూరత్కల్, సంయుక్తంగా ఆహార తయారీ వంటగదిని సందర్శించి, పరీక్షీంచారు. అక్కడి ఆహార నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆధరాలు సేకరించారు.

హాస్టల్‌లో పెట్టె మాంసం మరియు ఇతర ఆహార పదార్థాలు సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్ కు పంపించారు. నీటి నమూనాలు మరియు వంటగదిలో వెంటనే ఆహారాన్ని తయారు చేయడం జిల్లా ఆరోగ్య శాఖకు పరిమితం చేయబడింది. అంతేకాకుండా పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, నీరు అందించాలని అధికారులు సంబంధిత సిబ్బందికి సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+