వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరదా అనుకుంటే ప్రాణమే పోయింది.. చెన్నైలో 'ఫుట్ బోర్డ్' విషాదం..

ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ చెన్నైలో ముగ్గురు యువకులు మృతి చెందడం వారి తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని ఎంత హెచ్చరించినా.. చాలామంది యువకులు ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. సరదా పేరుతో ఫుట్ బోర్డు ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ చెన్నైలో ముగ్గురు యువకులు మృతి చెందడం వారి తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. పల్లవాన్ పాంగన్ సమీపంలోని సెయింట్‌ థామస్‌ మౌంట్‌ వద్ద ఎంఎంటీఎస్ లో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు ఫుట్ బోర్డు నుంచి అదుపు తప్పి కిందపడిపోయారు.

Foot board journey leads to death, seven slips from moving train

ఇందులో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మిగతా ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు కన్నుమూశాడు. మిగిలిన నలుగురి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న సమయంలో రైలు పట్టాల పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని వీరు ఢీకొన్నారు. దీంతో మొత్తం ఏడుగురు యువకులు కిందపడిపోగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

English summary
In a tragic train incident three youth were died on spot in chennai. Seven youth were slipped from train while they are travelling on foot board
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X