నరేంద్ర మోడీ బయోపిక్: డాక్యుమెంటరీ ఫిలిం కోసం పాత రైలు బోగీ తగులబెట్టారు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ డాక్యుమెంటరీ కోసం ఓ పాత రైలును తగులబెట్టారు. ప్రధానిపై ఓ డాక్యుమెంటరీ తీస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం నాడు ఓ పాత రైల్వే కోచ్ను తగులబెట్టారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో గోద్రా అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
దీనికోసం ఓ మాక్ డ్రిల్ బోగీని వాడినట్లు వెస్టర్న్ రైల్వే అధికారి తెలిపారు. నిజానికి చిత్రీకరణ తర్వాత దానిని అలాగే తిరిగివ్వాలని చెప్పామని, డాక్యుమెంటరీ యూనిట్ మాత్రం దానిని తగులబెట్టారని చెప్పారు.

ఇది ఉపయోగించకుండా పక్కన పడేసిన మాక్ డ్రిల్ బోగీ అని, దీనిని అలాగే తిరిగివ్వాలన్న నిబంధనతో చిత్రీకరణ కోసం ఇచ్చామని, ఈ రైలు బోగీని ఉపయోగించినందుకు అద్దె వసూలు చేశామని అని వదోదర రైల్వే డివిజన్ అధికార ప్రతినిధి తెలిపారు.
ప్రతాప్నగర్ స్టేషన్లో కోచ్ కేర్ సెంటర్ దగ్గర ప్రత్యేకంగా సెట్ వేసి ఈ గోద్రా సీన్ను చిత్రీకరించినట్లు డాక్యుమెంటరీ డైరెక్టర్ ఉమేష్ శుక్లా తెలిపారు. 4 రోజుల పాటు ఈ స్టేషన్లో షూటింగ్కు అనుమతిని ఇచ్చారు. 2002, ఫిబ్రవరి 27న జరిగిన గోద్రా రైలు ప్రమాదంలో 59 మంది కరసేవకులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీని తర్వాత రాష్ట్రంలో మత కలహాలు చెలరేగాయి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications