గుప్త నిధుల కోసం .. అమావాస్య నాడు కాళీమాతకు ఐదుగురు చిన్నారుల బలికి యత్నం
గుప్త నిధుల కోసం నరబలులు , పిల్లలు పుడతారని చేతబడులు .. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధిస్తున్నా మూఢనమ్మకాలు ఇంకా కొన్ని రాష్ట్రాలలో ప్రబలంగానే ఉన్నాయి. మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్న వారు జంతు బలులు, నర బలులు కొనసాగిస్తున్న కథనాలు నిత్యం వింటున్నాం . తాజాగా జార్ఖండ్లో నరబలి ఘటన చోటు చేసుకోగా అస్సాంలో ఇప్పుడు మరో నరబలుల యత్నం జరిగింది. కన్నతండ్రి కొడుకు పుడతాడని కూతురి గొంతు కోసి అత్యంత పాశవికంగా బలి ఇచ్చిన ఘటన మరువక ముందే అస్సాంలో గుప్త నిధుల కోసం ఐదుగురు పిల్లలని బలి ఇవ్వటానికి ప్రయత్నం జరిగింది .

గుప్తనిధుల కోసం కాళీమాతకు చిన్నారుల బలికి యత్నం
అసోంలోని శివసాగర్ జిల్లాలోని శివసాగర్ జిల్లాకు చెందిన జమియుల్ హుస్సేన్, షరీఫుల్ హుస్సేన్ లు అమావాస్య నాడు కాళీ మాతకు చిన్నారులను బలిస్తే గుప్తనిధులు దొరుకుతాయని మంత్రగాడి మాటలు విని తమ ఇంటి వెనకాల ఉన్న మామిడి చెట్టుకు చిన్నారులను కట్టేసి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాళీమాతకు చిన్నారులను బలిస్తే గుప్తనిధులు దొరకడంతో పాటు కుటుంబంలోని అన్ని సమస్యలు తీరుతాయని మాంత్రికుడు వారికి చెప్పడంతో అది నమ్మి పిల్లలను బలి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు.

ఐదుగురు చిన్నారులను రెస్క్యూ చేసిన పోలీసులు
ఈ విషయం తెలిసిన పోలీసులు ఐదుగురు మైనర్ బాలురను బలి ఇవ్వకుండా రక్షించారు. గుప్త నిధి వస్తుందనే ఆశతో మంత్రగాడి సలహా మేరకు మైనర్ బాలురలో ఒకరి తండ్రి తన సొంత కొడుకులను, తన సోదరుడి ముగ్గురు కొడుకులను బలి ఇవ్వాలనుకున్న ఘటనపై ఇంకా దర్యాప్తు సాగుతుందని అంటున్నారు పోలీసులు . అయితే వారు నరబలికి ప్రయత్నించారని దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు . నరబలులు జరగబోతున్నాయనే సమాచారంతో ఒక పోలీసు బృందాన్ని డెమోముఖ్ కు పంపామని, ఐదుగురు అబ్బాయిలను మా అదుపులోకి తీసుకున్నామని శివసాగర్ పోలీసు సూపరింటెండెంట్ అమితవ సిన్హా అన్నారు.

క్షుద్ర పూజలు, నరబలులపై స్థానికుల ఫిర్యాదు .. పోలీసుల దర్యాప్తు
నరబలుల కోసం ప్రయత్నించిన ఆరోపణలు ఇంకా ధృవీకరించబడలేదు. దీనిపై ప్రచారం జరగటం మినహాయించి నేరం గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవని అంటున్నారు . స్థానికుల కథనం ప్రకారం, అబ్బాయిలలో ఒకరి తండ్రి చిన్నారులను బలి ఇవ్వాలనుకున్నాడు. వారు క్షుద్ర పూజలను ప్లాన్ చేశారని , పిల్లలను బలి ఇవ్వాలనుకున్నారని అంటున్నారు. ఈ సంఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరియు మైనర్ అబ్బాయిల తండ్రులు అయిన జమీరుల్ హుస్సేన్ మరియు షరీఫుల్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు మరింత విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications