సుష్మాస్వరాజ్కు రాహుల్ ప్రశంసలు, కానీ: నెటిజన్ల సెటైర్లు
ఐక్య రాజ్య సమితి వేదికపై భారతవాణిని గట్టిగా వినిపించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితి వేదికపై భారతవాణిని గట్టిగా వినిపించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.
ఐరాస వేదికగా ఆమె చేసిన ప్రసంగంలో ఐఐటి, ఐఐఎంలను ప్రస్తావించినందుకు రాహుల్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో తెలిపారు.
ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాల గొప్ప దూరదృష్టి, ఘన వారసత్వాలను గుర్తించినందుకు కృతజ్ఞతలు సుష్మా జీ అని రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు.
కాగా, ఈ ట్వీట్ పైన రాహుల్ పైన సెటైర్లు వస్తున్నాయి.ఐఐటీలు, ఐఐఎంలను తామే నెలకొల్పామని గుర్తు చేస్తూ, రాహుల్ ఈ కామెంట్ చేయగా, నెటిజన్లు వెంటనే స్పందించారు.
విద్యాసంస్థలతో పాటు పెద్ద పెద్ద కుంభకోణాలు సైతం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఎద్దేవా చేశారు. మీరు పార్టీ గురించి మాట్లాడుతున్నారని, సుష్మా దేశం గురించి మాట్లాడారని గుర్తు చేశారు.