గ్యాంగ్రేప్: 6గురు నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే కొడుకు
నిందితుల్లో ఒకడైన ఎక్కా నాన్ల పటేల్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడున్న ఐదుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధిరాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన ఆగస్టు 14న జరిగింది. బాధిత యువతిని ఎక్కా నాన్ల పటేల్ ఎత్తుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతిపై ఏడు రోజులపాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.
ఘటనా స్థలం నుంచి ఎలాగోలా తన ఇంటికి చేరుకుంది బాధిత యువతి. ఆ తర్వాత జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో బాధిత యువతితోపాటు కుటుంబసభ్యులు గురువారం రాత్రి భగ్వాన్పురా పోలీసులను ఆశ్రయించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం కోర్టు ముందు హాజరుపర్చారు.