కేసీపీ గ్రూప్ అధినేత, ఫిక్కీ మాజీ అధ్యక్షుడు వీఎల్ దత్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) మాజీ అధ్యక్షుడు వెలగపూడి లక్ష్మణదత్(82) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. లక్ష్మణదత్కు భార్య ఇందిరా దత్, కుమార్తె కవిత ఉన్నారు.
డిసెంబర్ 27, 1937జన్మించారు వెలగపూడి లక్ష్మణ్ దత్(వీఎల్ దత్). ఆయన మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలోనూ ఆయన పాత్ర చెప్పుకోదగినదే. కృష్ణా జిల్లా ఉయ్యూరు, గుంటూరు జిల్లా మాచర్ల, చెన్నైలో కేసీపీ పరిశ్రమలను ఆయన స్థాపించారు. 1989లో ఆయనకు ప్రభుత్వం యాజమాన్య రత్న పురస్కారంతో గౌరవించింది. 1991లో నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీని ప్రదానం చేసింది. ఆయన గతంలో ఫిక్కీ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

తీరని లోటంటూ ఉపరాష్ట్రపతి
భారత పారిశ్రామిక రంగానికి వీఎల్ దత్ మరణం తీరని లోటని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మరణవార్త తెలిసిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు వెంకయ్య. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో వీఎల్ దత్ సేవలు మరవేలమన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడుల విధానంలో ఆయన నిష్ణాతుడని ప్రశంసించారు. వీల్ దత్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.
Recommended Video

టీఆర్ఎస్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు.. వీఎల్ దత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం చెన్నై వెళ్లి నివాళులర్పిస్తానని చెప్పారు. ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగానికి వీఎల్ దత్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. పారిశ్రామిక రంగానికి, ప్రభుత్వాలకు ఆయన ఒక వారధిలా ఉండేవారని కొనియాడారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications