కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ మనిషి: లలిత్ మోదీ
న్యూయార్క్: బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుంటున్న లలిత్ మోదీ మీద ఏ విధంగా స్పందించాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీద లలిత్ మోదీ నోరు పారేసుకున్నాడు.
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీద విమర్శలు గుప్పించారు. అరుణ్ జైట్లీ బీజేపీలో ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అంటు ట్విట్ చేశారు. అదే విధంగా పలువురు కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ట్విట్ చేశాడు.
ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) కుంభకోణంలో అరుణ్ జెట్లీ ప్రమేయం ఉందని నేరుగా ఆరోపించారు. అరుణ్ జెట్లీ తన ఫోన్ కాల్ డేటాను బయటపెడితే అన్ని విషయాలు వెలుగు చూస్తాయని అన్నారు. వెంటనే కాల్ డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ విషయంపై స్పందించడానికి అరుణ్ జైట్లీ నిరాకరించారు. వ్యాపారంలో భాగంగానే రాజస్థాన్ ముఖ్యమంత్రి కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలలో లలిత్ మోదీ పెట్టుబడులు పెట్టారని వివరించారు.
ఆర్థిక అక్రమ నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కోంటున్న లిలిత్ మోదీకి అక్రమంగా వీసా మంజూరు చేశారని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఇప్పుడు లలిత్ మోదీ అరుణ్ జెట్లీని టార్గెట్ చేసుకున్నాడు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications