వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్సీపీ నేత, మహా మాజీ హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ కన్నుమూత
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతను లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. ముంబై పేలుళ్ల సమయంలో ఆయన మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు.
ఆర్ ఆర్ పాటిల్ 1957 ఆగస్టు 16న జన్మించారు. మహారాష్ట్రలోని అంజనిలో పుట్టారు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు స్మితా పాటిల్, రోహిత్ పాటిల్. కాంగ్రెస్ - ఎన్సీపీ పొత్తులో భాగంగా ఆయన మహారాష్ట్ర మంత్రిగా పని చేశారు. పలు కీలక శాఖలను ఆయన చేపట్టారు.
Comments
English summary
Former Maharashtra chief minister RR Patil, who was suffering from oral cancer, passed away in Mumbai on Monday.
Story first published: Monday, February 16, 2015, 17:06 [IST]