సౌత్ ఇండియా క్వీన్గా హైదరాబాద్ యువతి ఐశ్వర్య
బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి చెందిన యువతి మిస్ సౌత్ ఇండియా పోటీల్లో కిరీటం కైవసం చేసుకున్నారు. బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా క్వీన్ పోటీల్లో తెలంగాణకు చెందిన ఐశ్వర్య బాస్పూరె కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
బెంగళూరులోని చౌడయ్య స్మారక భవనంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో 20 మంది యువతులు పాల్గొన్నారు. అందం, హావభావాలతో న్యాయ నిర్ణేతలను మెప్పించిన హైదరాబాదుకు చెందిన ఐశ్వర్య సౌత్ ఇండియా క్వీన్గా ఎంపికయ్యారు.
కర్ణాటకకు చెందిన సీమా తొలి రన్నరప్, తమిళనాడుకు చెందిన దివ్యశ్రీ రెండో రన్నరప్ స్థానంలో నిలిచారు. లయన్స్ క్లబ్ సహకారంతో నిహమ్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ పోటీలు నిర్వహించింది. ఈ కిరీటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తనియా సింగ్, మేధా రవీంద్రనాధ్, సభా ప్రవీణ్ షేక్, ఎంజ్యోతి తలపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మౌనిషా సింగ్, రితూ గౌతమ్, ఐశ్వర్య బాస్పూరె, కే రూప పోటీపడ్డారు.