మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం విషమం: రేపటి బీజేపీ కార్యక్రమాలు రద్దు, మోడీ పరామర్శ
Recommended Video
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి(93) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, వాజపేయి ఆరోగ్యం బుధవారం మరింత క్షీణించడంతో బీజేపీ తన గురువారం నాటి అధికారి కార్యక్రమాలు అన్ని వాయిదా వేసుకుంది. గురువారం జరగాల్సిన విజయవాడ బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఆరోగ్యం విషమించిందనే సమాచారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రాత్రి ఎయిమ్స్లో వాజపేయిని పరామర్శించారు.
Prime Minister Narendra Modi reaches All India Institutes of Medical Sciences (AIIMS) to meet Former Prime Minister Atal Bihari Vajpayee. #Delhi pic.twitter.com/BeGhqVh0z2
— ANI (@ANI) August 15, 2018
కాగా, మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్కు వెళ్లి చికిత్స పొందుతున్న వాజ్పేయిని పరామర్శించారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా వాజపేయిని పరామర్శించారు.
మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజపేయి జూన్ 12న ఎయిమ్స్లో చేరారు. ప్రస్తుతం వాజపేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్తోపాటు డిమెన్షియా ఉంది.