భార్య హత్య కేసు, మాజీ యాంకర్కు హైకోర్టులో భారీ ఊరట, నిర్దోషిగా విడుదల
ఢిల్లీ: భార్య హత్య కేసులో మాజీ టీవీ యాంకర్ సుహేబ్ ఇల్యాసిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషిగా విడుదల చేసింది. పద్దెనిమిదేళ్ల క్రితం భార్య హత్య కేసులో ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆయనకు ఈ రోజు కోర్టులో భారీ ఊరట లభించింది.
అతను ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే కార్యక్రమంలో యాంకర్గా చేశారు. భార్య అంజు హత్య కేసులో అతనికి గత ఏడాది డిసెంబరు 16న న్యాయస్థానం శిక్ష విధించింది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొంది. తనకు శిక్ష విధించడాన్ని అతను హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది.

అతని భార్య అంజు 2000 సంవత్సరం జనవరి 11న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కత్తితో పొడిచిన గాయాలతో ఇంట్లో పడి ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ఆమె మృతి చెందింది.
కొన్ని నెలల పాటు విచారణ జరిపిన అనంతరం పోలీసులు భర్తను అదే ఏడాది మార్చి 28న అరెస్టు చేశారు. కట్నం కోసం వేధించేవాడని అంజు తల్లి, సోదరి చేసిన ఫిర్యాదుతో అతనిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనకు గత ఏడాది జీవిత ఖైదు పడింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అతనికి ఈ ఏడాది ఆరంభంలో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండో భార్యను చూసుకునేందుకు బెయిల్ వచ్చింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications