పద్మ అవార్డుల ప్రదానం : సుష్మా స్వరాజ్ తరఫున పద్మవిభూషణ్ అందుకున్న కుమార్తె బన్సురీ
కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ రాష్ట్రపతి భవన్ లో ప్రధానం చేశారు. ఇందులో పలువురు అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.ఇందులో పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారులు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారు ఉన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విదేశాంగశాఖ మాజీ మంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ తరఫున మరణానంతరం ఆమె కుమార్తె బన్సురీ స్వరాజ్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. విదేశాంగమంత్రితో పాటు వివిధ అంశాల్లో ఆమె చేసిన సేవలకు గుర్తుగా మరణానంతరం ఆమెకు కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు గతంలో ప్రకటించింది. ఆమె తరఫున కుమార్తె బన్సురీ ఈ అవార్డును అందుకున్నారు.

ఇవాఅళ పద్మభూషణ్ అవార్డులు అందుకున్న వారిలో ఒలింపియన్ పీవీ సింధు, టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, హిందుస్తానీ క్లాసికల్ ప్లేయర్ పండిట్ చానూలాల్ మిశ్రా వంటి వారు ఉన్నారు. సింగర్ అద్నాన్ సమీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్, ఎయిర్ మార్షల్ డాక్టర్ పద్మా బందోపాధ్యాయ్ పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న వారిలో ఉన్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడంపై విజేతలు సంతోషం వ్యక్తం చేశారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications