వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలు కిడ్నాప్, గ్యాంగ్ రేప్

|
Google Oneindia TeluguNews

కొచ్చి: స్కూల్ నుంచి ఇంటికి వెలుతున్న ఇద్దరు విద్యార్థినిలను కిడ్నాప్ చేసి అటవి ప్రాంతంలోకి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

పతనంతిట్ట సమీపంలోని చెరిఎజికల్ గ్రామంలో నివాసం ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు పతనంపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఒకరు 9వ తరగతి, ఒకరు10వ తరగతి చదువుతున్నారు. వీరు నివాసం ఉంటున్న గ్రామం అటవి ప్రాంతం (ఏజెన్సీ) సమీపంలో ఉంటుంది.

Four boys were arrested in Pathanamthitta district in Kerala

గత శనివారం సాయంత్రం ఇద్దరు అమ్మాయిలు పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో నలుగురు యువకులు ఇద్దరిని కిడ్నాప్ చేసి అటవి ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. తరువాత అమ్మాయిలపై రాత్రి వరకు సామూహిక అత్యాచారం చేశారు.

అమ్మాయిలు ఇద్దరూ ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం చేసిన యువకులను అమ్మాయిలు గుర్తు పట్టడంతో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

అమ్మాయిల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న నిందితులు శనివారం సాయంత్ర మార్గం మద్యలో వారిద్దరిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. అరెస్టు అయిన నలుగురూ విద్యార్థులే అని పోలీసులు తెలిపారు. అందరికి వైద్య పరిక్షలు నిర్వహించామని పోలీసులు అన్నారు.

English summary
Four boys were arrested in Pathanamthitta district of Kerala for allegedly gang raping two schoolgirls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X