నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
నిత్యానందస్వామిపై ఫ్రెంచ్ ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. 4 లక్షల అమెరికా డాలర్ల మోసానికి సంబంధించి విచారణ చేపడుతామని ప్రకటించింది. ఫ్రెంచ్కి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. నిత్యానంద అనుచరులు తమను మోసం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఫ్రెంచ్ ప్రభుత్వం విచారణ చేపట్టింది.
గడువుతీరిన పాస్పోర్టుతో నిత్యానంద స్వామి విదేశాలకు పారిపోయారు. దీవిలో దాగి నక్కినట్టు వార్తలొచ్చాయి. మరోవైపు నిత్యానంద ఆశ్రమానికి చెందిన ఇద్దరు సాధ్వీలు ప్రాణ్ప్రియ, ప్రియతత్వలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కిడ్నాప్, వేధింపులు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నేరాల కింద వారిని అదుపులోకి తీసుకుని, ఐదురోజులపాటు రిమాండ్కు తరలించారు. 9-10ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేసినట్లు వీరిద్దరిపై ఆరోపణలున్నాయి. మరో ఇద్దరు చిన్నారులను పోలీసులు కాపాడి వారిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.