నేడూ రికార్డులకెక్కిన పెట్రో ధరలు90: ఏ సిటీలో ఎంతంటే?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. శనివారం కూడా ఇంధన ధరలు మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో శనివారం పెట్రోల్ ధర 35పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.63కు చేరింది.
ఇక డీజిల్ ధర కూడా 24పైసలు పెరిగి లీటర్ ధర రూ. 73.54గా ఉంది. ఇంధన ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో పెట్రోల్ ధర రూ. 90కి మరింత చేరువైంది. శనివారం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 89.01గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ. 78.07కు చేరింది.

హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.18, డీజిల్ ధర రూ. 79.73గా ఉండగా.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.41, డీజిల్ ధర రూ. 78.63కు చేరింది.
సెప్టెంబరు 5, సెప్టెంబరు 12 మినహా గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్పై రూ. 4.83, డీజిల్పై రూ.5 పెరిగింది. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
-
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications