Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

G20 Summit: జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్ట్ కంటికి ఐప్యాచ్, కారణం ఇదే

న్యూఢిల్లీ: జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఓలాఫ్ స్క‌ల్జ్‌(Olaf Scholz).. ఢిల్లీలో జ‌రుగుతున్న జీ20 స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. జీ20 సమావేశాల వేదిక భార‌త మండ‌పంలో ఉన్న కోణార్క్ వీల్ వ‌ద్ద శనివారం ఉదయం ఆయ‌నకు ప్ర‌ధాని నరేంద్ర మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. ఆ స‌మ‌యంలో స్క‌ల్జ్‌.. త‌న కంటికి ఐప్యాచ్ ధ‌రించి ఉన్నారు.

భారత్ చేరుకున్న సమయంలోనూ తన కంటికి ఐప్యాచ్ ధరించే ఉన్నారు. అయితే, సాధార‌ణంగా కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్న వాళ్లు ధ‌రించే న‌ల్ల రంగు ప్యాచ్‌ను జర్మనీ ఛాన్సలర్ స్క‌ల్జ్ త‌న కంటికి ధ‌రించారు. అయితే దీనిపై ఆ దేశ ప్ర‌భుత్వ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. 65 ఏళ్ల ఛాన్స‌ల‌ర్ గ‌త వారం జాగింగ్ చేస్తూ కిందపడిపోయి గాయ‌ప‌డిన‌ట్లు ప్ర‌తినిధి తెలిపారు. దీంతో ఆయ‌న కుడి క‌న్ను దెబ్బ‌తిన్న‌ది.

G20 Summit: This is the reason, why German Chancellor Olaf Scholz Wears An Eye Patch
స్వ‌ల్ప స్థాయిలో ఆయ‌న కంటికి గాయాల‌య్యాయ‌ని, మ‌రికొన్ని రోజుల పాటు స్క‌ల్జ్ ఆ బ్లాక్ క‌ల‌ర్ ఐ ప్యాచ్ ధ‌రించాల్సి ఉంటుంద‌ని జర్మనీ ప్రభుత్వ ప్ర‌తినిధి తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్ర‌తి రోజూ జాగింగ్ చేసే అల‌వాటు ఛాన్స‌ల‌ర్ స్క‌ల్జ్‌కు ఉన్న‌ట్లు ప్ర‌తినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్ తెలిపారు.

మరోవైపు, జీ20 సమావేశాల నేపథ్యంలో వివిధ దేశాధి నేతలు శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం భారత మండపంలో తొలి రోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్య దేశంగా ప్రతిపాదించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందుకు అన్ని సభ్య దేశాలు అంగీకరించడంతో ఇక నుంచి జీ20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా శాశ్వత సభ్య దేశంగా కొనసాగనుంది.

అంతకుముందు, శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా భారత్ మండపానికి చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ స్వాగతం పలికారు. సదస్సు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.20 నుంచి 10.20 మధ్యలో వివిధ దేశాధి నేతలు, విదేశీ ప్రతినిధులు భారత్ మండపానికి చేరుకున్నారు. వీరందరికీ ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలికారు.

మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశాధినేతలు, ప్రపంచ ప్రతినిధులకు ట్విట్టర్ వేదికగా స్వాగతం పలికారు. 'జీ20 సభ్య దేశాధినేతలకు, అతిథి దేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు ఢిల్లీలో జరుగుతున్న 18వ జీ20 సదస్సుకు స్వాగతం' అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, G20 గ్రూపులోని ఇతర నాయకులు అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఆర్థిక సహకార సంస్థ వంటి అనేక ప్రముఖ ప్రపంచ సంస్థల చీఫ్‌లు, అభివృద్ధి (OECD) సమ్మిట్ కోసం దేశ రాజధానిలో కలిశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+